తమిళనాడులోని కోయంబత్తూరు కారు సిలిండర్ పేలుడు కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా తమిళనాడులోని 45 ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
కోయంబత్తూరులో 40 చోట్ల, చెన్నైలో ఐదు చోట్ల తనిఖీలు చేపట్టారు.అదేవిధంగా అనుమానితుల నివాసాల్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని సమాచారం.