తెలుగు సినీ ప్రేక్షకులకు లేడీ సూపర్ స్టార్ నయనతార( Nayanthara ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నయనతార ప్రస్తుతం కోలీవుడ్,బాలీవుడ్( Kollywood, Bollywood ) సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతూ, టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
ఇకపోతే నయనతార కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఈ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు కూడా ఉన్నారు.
అయితే సరోగసి ద్వారా నేను ద్వారా కవల పిల్లలకు తల్లి అయిన విషయం మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం ఒకవైపు పిల్లల బాధ్యతలు చూసుకుంటూనే మరొకవైపు సినిమాలలో హీరోయిన్గా నటిస్తోంది.తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు తన భర్త పిల్లలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.కాగా ఈ జంట జూన్ 9 2022లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
తాజాగా ఈ జంట రెండో వివాహా వార్షికోత్సవం జరుపుకున్నారు.ఈ సందర్భంగా భర్త విఘ్నేశ్ శివన్ స్పెషల్ పోస్ట్ చేశారు.
సోషల్ మీడియా వేదికగా తన భార్యతో కలిసి చిల్ అవుతోన్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు.
ఈ మేరకు విగ్నేష్ శివన్ ( Vignesh Sivan )తన ఇన్స్టాలో ఈ విధంగా రాసుకొచ్చారు.పదేళ్ల నయనతార.రెండేళ్ల విక్కీ-నయన్.
ఇవాళ మా రెండో వివాహా వార్షికోత్సవం.నిన్ను పెళ్లి చేసుకోవడం, ఉయిర్ ఉలగం రావడం నా జీవితంలోకి అతి గొప్పవిషయం.
నా భార్య తంగమేయిని చాలా ప్రేమిస్తున్నాను.నీతో మరెన్నో ఆహ్లాదకరమైన సమయాలు, జ్ఞాపకాలు, విజయవంతమైన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను.
ఎలాంటి పరిస్థితుల్లనైనా నీకు తోడుగా ఉంటాను.ఆ భగవంతుడు ఎల్లవేళలా మనకు అండగా నిలవాలని కోరుకుంటున్నాను.
మన ఉయిర్, ఉలగంతో సంతోషంగా ఉండాలనేదే ఆశయం.ఆలాగే మన పెద్ద పెద్ద ఆశయాలు నెరవేరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ వీడియోను పోస్ట్ చేశారు.