నవీన్ పోలిశెట్టి.జాతిరత్నాలు సినిమాలతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్న ఈ హీరో ప్రస్తుతం తన తదుపరి సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు.
మహేష్ బాబు నిర్మాణంలో వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.తొలి సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస చిత్రంతో ఆకట్టుకున్న నవీన్ పోలిశెట్టి రెండో సినిమా తో ఇంత బిజీ అవుతాడని ఎవరు అనుకోలేదు.
సినిమా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుండగా రెమ్యునరేషన్ కూడా బాగానే పెంచడాన్ని వార్తలు వచ్చాయి.
ఈనేపథ్యంలో అయన ముంబై లో సినిమా అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు చేసిన కొన్ని పనులను ఇప్పుడు ఓ ఇంటర్వ్యూ ద్వారా చెప్పాడు.
క్వినావో అనే ఐటెం ని రెస్టారెంట్ లలో ఏవిధమైన టెక్నీక్ తో అమ్మేవాడా చెప్పాడు.ఆ టెక్నీక్ చూసి ఆయనని సినిమాల్లోనే కాదు బయటకు నవీన్ జాతిరత్నం అని పొగిడేస్తున్నాడు.
ముంబై లో సినిమా అవకాశాల కోసం తిరుగుతున్న రోజులవి.ఆ సమయంలో క్వినావో ని అమ్మడానికి అయన ఏం చేశేవారంటే ముందుగా ఓ కస్టమర్ గా రెస్టారెంట్ కి వెళ్లి క్వినావో ని ఆర్డర్ చేశేవారట.
నిజానికి అప్పటికీ అక్కడ క్వినావో లేకపోయేసరికి అక్కడ వైటర్స్ ఆ ఆర్డర్ లేదని చెప్పేవారు.దాని యొక్క బెనిఫిట్స్ ని క్లియర్ గా చెప్పేవాడు నవీన్.దాంతో ఇదేదో మంచి ఆహారపదార్ధమని ఆ రెస్టారెంట్ వాళ్ళు కొనాలి అనుకునేవారు.అయితే సరిగ్గా అప్పుడే నవీన్ తన వాళ్లనే పంపి వాళ్లకి క్వినావో ని అమ్మించేవాడు.
ఇలా అన్ని రెస్టారెంట్ లకు చేసేవాడట.ఏదేమైనా నవీన్ తెలివి తేటల్ని మెచ్చుకోవలసిందే కదండీ.
ఆ తర్వాత సినిమా అవకాశాలు దక్కించుకుని ప్రస్తుతం ఫుల్ బిజీ స్టార్ అయ్యాడు.