వైసీపీ మంచి కోరుతున్న రఘురామ ! ఆయన్ను మార్చాలంటూ ..?

మొన్నటివరకు రాజకీయంగా మంచి జోష్ లో కనిపించిన ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఈ మధ్య చోటు చేసుకున్న కొన్ని పరిణామాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.ముఖ్యంగా పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి ఒక్క స్థానాన్ని దక్కించుకోవడం,  తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొంతమంది టిడిపి అభ్యర్థికు మద్దతు తెలపడం , వారిని సస్పెండ్ చేయడం తదితర పరిణామాలతో రాజకీయంగా టిడిపి నుంచి ఎన్నో విమర్శలు వైసిపి ఎదుర్కొంటుంది.

 Narasapuram Mp Raghu Rama Krishna Raju Comments On Sajjala Ramakrishna Reddy ,-TeluguStop.com
Telugu Ap Cm Jagan, Ap, Sapuram Mp, Rebal Mp, Telugudesam, Ysrcp-Politics

తాజాగా వైసీపీలో తలెత్తిన పరిణామాలపై ఆ పార్టీ రెబల్ ఎంపీగా గుర్తింపు పొందిన నరసాపురం వైసీపీ ఎంపీ రఘురాం కృష్ణంరాజు( Raghu Rama Krishna Raju ) స్పందించారు .ఈ మేరకు జగన్ కు అనేక సూచనలు చేశారు.ప్రభుత్వ సలహాదారు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి పైన ఆరోపణలు చేశారు .వెంటనే ఆయన్ను మార్చకపోతే వైసిపి మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందని సూచించారు .మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మంచివారైనా , 1995లో పార్టీలోనూ , ప్రభుత్వంలోనూ ఒకరి ప్రమేయం ఎక్కువైన కారణంగా వారు ఎమ్మెల్యేలను అవమానించి అవహేళన చేసినట్లుగా ప్రవర్తించడం వల్ల టిడిపిలో సంక్షోభం తలెత్తిందని,  పార్టీ పరిరక్షణ కోసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర నాయకులు చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకున్నారని,  ఇదే విషయాన్ని ఇటీవల బాలకృష్ణ షో లో చంద్రబాబు కూడా చెప్పారని రఘురాం గుర్తు చేశారు.వైసీపీలోను ఓ వ్యక్తిని ఒక వర్గం ఎమ్మెల్యేలు అలాగే సంభోదిస్తున్నారని,  పరిస్థితి చేయి దాటకముందే ఆ వ్యక్తిని పక్కన పెట్టకపోతే నలుగురు కాస్త 40 మంది అవుతారని ఇంకా ఎక్కువ మందిలో అసంతృప్తి పెరిగి అసెంబ్లీలో ఏదైనా ప్రతిపాదన పెడితే పరిస్థితి దారుణంగా ఉండవచ్చు అంటూ పరోక్షంగా సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala Ramakrishna Reddy )ఉద్దేశించి రఘురామ విమర్శలు చేశారు.

మెజారిటీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ ను ప్రేమిస్తున్నారని తక్షణమే జగన్ జాగ్రత్త పడాలని సూచించారు.

Telugu Ap Cm Jagan, Ap, Sapuram Mp, Rebal Mp, Telugudesam, Ysrcp-Politics

 ఎమ్మెల్యేలంతా ఆ వ్యక్తికే రిపోర్ట్ చేయాలని సరికాదని,  ఉద్యోగులైనా,  ఎమ్మెల్యేలైన,  మంత్రులకైనా విలువ ఇవ్వకుండా ఆ వ్యక్తినే   కలవాలని జగన్ సూచించడం సరైనది కాదు అంటూ రఘురామ అన్నారు.రాజకీయ పార్టీ అంటే ఎవరి సొత్తు కాదని,  పార్టీ సభ్యులందరికీ అధినేత జవాబుదారీగా ఉండాలని,  తాను ఏ పార్టీ సభ్యుడైన,  పార్టీ అధ్యక్షుడు తో పాటు ఆ వ్యక్తి కూడా తనకు  జవాబు దారే అని అన్నారు.ఇష్టం వచ్చినట్లుగా పార్టీని నడుపుతాను అంటే కుదరదని , మీ వ్యక్తిగత జీవితంలో మాత్రమే మీ ఇష్టం వచ్చినట్లుగా ఉంటానంటే చెల్లుతుంది అంటూ జగన్ కు సూచించారు .పార్టీ నిర్వహణ , విధివిధానాలు ఏమిటో ఎన్నికల సంఘం నియమావళిని ఒకసారి చదువుకోవాలని,  నలుగురితో ప్రేమగా ఉంటే సీఎం జగన్ గతంలోలా ఉండవచ్చని అన్నారు.అలాగే జగన్ ( YS jagan )ప్రసంగంలోనూ  మార్కు కనిపించిందని,  దత్తపుత్రుడు, , దుష్ట చతుష్టయం అన్న వ్యాఖ్యలు ఆయన నోటి నుంచి వినిపించలేదని రఘురామ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube