Nara Brahmani: చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వారికి తెలీదు.. బ్రాహ్మణి షాకింగ్ కామెంట్స్ వైరల్!

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాగే ఏపీ రాజకీయాలలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో నారా బ్రాహ్మణి( Nara Brahmani ) పేరు కూడా ఒకటి.రాజకీయాలకు దూరంగా ఉంటూ ఇంటి బాధ్యతలు చూసుకుంటూ బిజినెస్ రంగం వైపు దూసుకుపోతున్న నారా బ్రాహ్మణి ఎన్నడు లేని విధంగా తన మామయ్య టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) అరెస్టుతో ఒక్కసారిగా రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చింది.

 Nara Brahmani Tweet On Kanthi Tho Kranthi-TeluguStop.com

ఈ నేపథ్యంలోని వైసీపీకి నెమ్మదిగానే చురకలు అంటిస్తోంది.

వైసీపీ( YCP ) చేసింది చాలా తప్పు అని తన మామయ్య అరెస్టుపై ఖండిస్తోంది.ఇప్పటికే పలుసార్లు మీడియాతో ముచ్చటించిన నారా బ్రాహ్మణి వైసీపీ పై సెటైర్లు వేస్తూ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈమె మరోసారి సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.

ఈ మేరకు ఆమె తన ట్వీట్ లో ఈ విధంగా రాసుకొచ్చింది.మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేసి దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్లు మూసుకో అని కొందరు అంటున్నారు.

చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్నారు.

కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వాళ్లకు తెలీదు.మనమెందుకు చీకట్లో ఉండాలి? అక్టోబర్‌ 7న రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్లు ఆఫ్‌ చేసి బయటకు వచ్చి 5 నిమిషాల పాటు దీపాలు, సెల్‌ఫోన్‌ టార్చ్‌, కొవ్వొత్తులు వెలిగిద్దాం.రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్‌ చేద్దాం అని బ్రాహ్మణి( Brahmani ) తెలిపింది బ్రాహ్మణి.

నారా బ్రాహ్మణి చేసిన ట్వీట్ వైరల్ అవ్వడంతో ఆ ట్వీట్ చూసిన నెటిజన్స్ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.జై టీడీపీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube