టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నిర్వహించనున్న బస్సు యాత్ర ఈనెల 25 నుంచి ప్రారంభం కానుంది.ఈ మేరకు చంద్రగిరి నియోజకవర్గం నుంచి ‘నిజం గెలవాలి’ పేరుతో బస్సు యాత్ర చేపట్టనున్నారు.
ఈ క్రమంలో ముందుగా రేపు తిరుమల శ్రీవారిని భువనేశ్వరి దర్శించుకోనున్నారు.రేపు రాత్రి స్వగ్రామం నారావారి పల్లెలో బస చేయనున్న ఆమె చంద్రగిరి సమీపంలోని అగరాల హైవే పక్కన బహిరంగ సభలో పాల్గొంటారు.
సభ ముగిసిన తరువాత బస్సు యాత్రను ప్రారంభిస్తారు.తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో బస్సు యాత్ర మూడు రోజులు పాటు కొనసాగనుంది.