కరోనా కూడా నాని స్పీడ్ ని ఆపలేక పోతుంది..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచులర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు నాని.ఈయన సినిమా రాబోతుందంటే ఆడియన్స్ ఏదో కొత్తదనం ఆశిస్తారు.

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మినిమం గ్యారెంటీ హీరోగా పేరు సంపాదించు కున్నాడు.నాని స్టార్ హీరోలు కూడా చేయనంత ఫాస్ట్ గా సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలతో దూసుకుపోతున్నాడు.

నాని శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమా పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.

అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాకుండానే నాని వెంటనే మరొక రెండు సినిమాలు లైన్లో పెట్టాడు.ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా అందరు షూటింగ్స్ వాయిదా వేసుకుంటుంటే నాని మాత్రం కరోనా ను ఏమాత్రం లెక్క చేయకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

Advertisement

ఇప్పడు కరోనా తో పోరాడుతూ నాని ఒకటి కాదు ఏకంగా రెండు సినిమాలను ఒకేసారి పూర్తి చేస్తున్నాడు.రాహుల్ సంక్రిత్యన్ శ్యామ్ సింగరాయ్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతంలో 6.5 కోట్ల ఖర్చుతో నిర్మించిన భారీ సెట్ లో ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది.ఈ సినిమాతో పాటు నాని అంటే సుందరానికీ సినిమా కూడా షూటింగ్ జరుగుతుంది.

ఈ సినిమా ను వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమాలో నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తుంది.

కరోనా ఎక్కువ అవుతున్న పరిస్థితు ల్లో కూడా చిత్ర యూనిట్ తగు జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ జరుపుతున్నాయి.ఈ రెండు సినిమాలు ఏకకాలంలో షూటింగ్ జరుగుతుండగా రెండు నెలల తేడాతోనే ఈ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు