అదనపు అడ్వకేట్ జనరల్ గా నల్లగొండ జిల్లా వాసి

నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ (ఏజీ)గా నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దవూర మండలం పినవూర గ్రామానికి చెందిన తేరా రజినీకాంత్ రెడ్డిని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి ఆర్.తిరుపతి ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

 Nalgonda District Rajinikanth Reddy As Additional Advocate General, Nalgonda Dis-TeluguStop.com

రజినీకాంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ తరుపున పలు కేసులు వాదించారు.

అంతేకాకుండా ప్రస్తుత సిఎం రేవంత్ రెడ్డి, డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మల్లు రవి తదితరుల వ్యక్తిగత కేసులను సహితం వాదించారు.46 ఏండ్ల వయసు గల రజినీకాంత్ రెడ్డి 2004లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు.అప్పటినుంచి ఆయన నిరంతరంగా న్యాయవాద వృత్తిలో సేవలు అందిస్తున్నారు.

ఆయనను అదనపు అడ్వకేట్ జనరల్ గా నియమించిడం పట్ల నాగార్జున సాగర్ నియోజకవర్గ,పెద్దవూర మండల ప్రజలు,పినవూర గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అతని సేవలు మరింత కాలం కొనసాగాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube