టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ది గోస్ట్.ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఇందులో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది.కాగా ఈ సినిమా నేడు దసరా పండుగ కానుకగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లు ఈ సినిమా పై అంచనాలను మరింత పెంచేసాయి.
ఇక ఈ సినిమా విడుదలకు ముందు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున ది గోస్ట్ సినిమా గురించి అలాగే తన తదుపరి సినిమాల విషయాల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలోనే సదరు యాంకర్ ఘోస్ట్ కథను ఎంచుకోవడానికి కారణం ఏంటి అని అడగగా.
నేను ఇప్పటివరకు చాలా యాక్షన్ సినిమాలు చేశాను కానీ ఎమోషన్ తో కూడిన ఒక స్టైలిష్ యాక్షన్ సినిమా చేయాలని ఉండేది.గరుడవేగ సినిమాలో ప్రవీణ్ సత్తార్ యాక్షన్ చాలా నచ్చి ప్రవీణ్ ని పిలిపించి మంచి యాక్షన్ మూవీ చేద్దామని చెప్పడంతో ది గోస్ట్ సినిమా కథను తయారు చేశాడు చెప్పుకొచ్చాడు నాగార్జున.
అలాగే తను నటించిన శివ సినిమా కూడా మళ్లీ థియేటర్లో తప్పకుండా విడుదల అవుతుంది అని తెలిపారు నాగార్జున.కొత్తగా ఏమైనా సినిమాలు చేయబోతున్నారా అని యాంకర్ ప్రశ్నించగా.ఆ విషయంపై స్పందించిన నాగార్జున ప్రస్తుతానికి రెండు మూడు కథలు చర్చల దశలో ఉన్నాయి అని తెలిపారు.అలాగే సినిమాలు అన్నీ కూడా యాక్షన్ డ్రామా జోనర్ లో ఉంటాయి.
సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లో కూడా చర్చల దశలో ఉన్నాయి అని తెలిపారు నాగార్జున.నాగార్జున మాటలను బట్టి చూస్తే త్వరలోనే వెబ్ సిరీస్ తో కూడా ప్రేక్షకులను పలకరించబోతున్నట్లు తెలుస్తోంది.