జనసేనకు 'మెగా సాయం' ! నాగబాబు వరుణ్ ఏం చేశారో తెలుసా...?

జనసేన పార్టీ ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తున్న సమయంలో స్పీడ్ గా ముందుకు వెళ్తోంది.

జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి మెగా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ దగ్గడంలేదు అనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తూనే ఉన్నాయి.

తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి జనసేన పార్టీకి భారీ విరాళం అందింది.మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, మెగా బ్రదర్ నాగబాబు భారీ విరాళం ప్రకటించారు.

ఈ విషయాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించారు.వరుణ్ కోటి రూపాయలు, అన్నయ్య నాగబాబు 25లక్షల రూపాయలు జనసేనపార్టీకి విరాళం ఇచ్చారని ఇవి తమపార్టీకి సర్‌ప్రైజ్ క్రిస్మస్ గిఫ్ట్ అంటూ పవన్ పేర్కొన్నారు.

స్వయంగా మిమ్మల్ని కలిసి కృతజ్ఞతలు చెబుతాననంటూ వరుణ్ తేజ్, నాగబాబులకు పవన్ సోషల్ మీడియా ముఖంగా విన్నవించారు.అటు జనసేన పార్టీకూడా వరుణ్ తేజ్, నాగబాబులకు కృతజ్ఞతలు తెలిపింది.కాగా, ప్రస్తుతం తన కుటుంబంతో కలసి యూరప్ లో ఉన్న పవన్ క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

ఈ క్రిస్మస్ పండుగ ప్రతీ కుటుంబంలో సుఖ సంతోషాలను తీసుకురావాలని ఆకాంక్షించారు.

.

Advertisement

తాజా వార్తలు