తెలుగు బుల్లితెరపై తన టాలెంట్ ను నిరూపించుకొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆర్టిస్టు ఎవరంటే సుడిగాలి సుధీర్ అని ఇట్టాగే చెప్పవచ్చు.సుదీర్ఘకాలంగా బుల్లితెరపై సందడి చేస్తున్న జబర్దస్త్ షో తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమై ఓ స్పెషల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.
నిజానికి ఈయనకు ఒక స్టార్ హీరోకు ఉన్నంత ఫాలోయింగ్ ఉందంటే నమ్మాల్సిందే.
జబర్దస్త్ లో కమెడియన్ గా అడుగుపెట్టి అతి తక్కువ సమయంలో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు.
అప్పటి నుంచి వెనుతిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.నిజానికి కెరీర్ మొదట్లో సుధీర్ మ్యాజిక్ లు చేసేవాడు.అలా పలు షోలలో మ్యాజిక్ లు చేసి జబర్దస్త్ దృష్టిలో పడ్డాడు.ఇక జబర్దస్త్ తో సుధీర్ కెరీర్ మొత్తం మారిపోయింది.
అలా జబర్దస్త్ లో యాంకర్ రష్మీ తో లవ్ ట్రాక్ నడుపుతూ అందరి దృష్టిలో పడ్డాడు.అలా ఈ షో లో వీరిద్దరి మధ్య జరిగే పెర్ఫార్మెన్స్ బాగా సందడిగా ఉంటుంది.
ఈ షో ద్వారా వెండితెరపై అవకాశం అందుకున్నాడు.పలు సినిమాలలో సహాయ పాత్రల్లోనూ నటించాడు.
అంతేకాకుండా హీరోగా కూడా పలు సినిమాలలో నటించి తనకంటూ మంచి పేరు సంపాదించుకున్నాడు.
అటు వెండి తెరపై, ఇటు బుల్లితెరపై సుధీర్ కు బాగా కలిసొచ్చింది.ఆ తర్వాత బుల్లి తెర పై కమెడియన్ గానే కాకుండా యాంకర్ గా కూడా అడుగు పెట్టాడు.గతంలో పోవే పోరా అనే షో తో యాంకర్ గా మంచి మార్కులు సంపాదించుకున్నాడు.
ఇక ఈటీవీలో ప్రసారమైన ఢీ షో లో టీం లీడర్ గా చేశాడు.గత కొంత కాలం నుండి శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా యాంకర్ గా చేసి మరింత గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
సుధీర్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.తనకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటాడు.
ఈయనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.నిజానికి ఈయనకు ఉన్న అభిమానం మాత్రం మాటల్లో చెప్పలేనిది.
చాలామంది ఈటీవీ లో ప్రసారమయ్యే పలు షోలను సుధీర్ కోసమే చూస్తుంటారు.
ఇక సుధీర్ కు అమ్మాయిల వీక్నెస్ ఉంటుందని ఆయన షో చూసే ప్రతి ఒక్కరికి తెలుసు.అలా ఏ షోలో నైనా సుధీర్ ను అమ్మాయిల విషయంలో బాగా ఆట పట్టిస్తుంటారు.ఇక ఈమధ్య సుధీర్ మల్లెమాల ప్రొడక్షన్ లో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షో ల నుండి బయటకి వచ్చేసాడు.
దీంతో స్టార్ మా లో అడుగుపెట్టి మళ్లీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
ఇక స్టార్ మా లో ఒక సింగింగ్ షోలో అనసూయతో కలిసి హోస్ట్ చేస్తున్నాడు.
ఇక తాజాగా మరో స్పెషల్ ఈవెంట్ లో కూడా కనిపించాడు సుధీర్. పార్టీ చేద్దాం పుష్ప అంటూ ఓ ఈవెంట్ నిర్వహించగా అందులో నాగబాబు స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు.
ఇక నాగబాబు సుధీర్ ఇద్దరు కలుసుకోవడంతో కౌగలించుకున్నారు.
ఆ తర్వాత సుధీర్ ఓ స్కిట్ లో పాల్గొని అందులో మాటలతో అందర్నీ నవ్వించగా వెంటనే నాగబాబు.ఈ పనులు చేయడానికా అక్కడి నుండి ఇక్కడికి వచ్చావు అంటూ కౌంటర్ వేశాడు.అంతేకాకుండా కమెడియన్ ధనరాజ్ కూడా సుధీర్ పై కౌంటర్లు వేశాడు.
మొత్తానికి ఈవెంట్ కు సుధీర్ రావడంతో మాత్రం దానికి మరింత సందడి వచ్చిందని అర్థం అవుతుంది.