టాలీవుడ్ హీరో బాలకృష్ణ ప్రస్తుతం అన్ స్టాపబుల్ షోకీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.తాజాగా ఈ షోకి టాలీవుడ్ సురేష్ బాబు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, అలాగే అల్లు అరవింద్ హాజరయ్యారు.
ఈ నేపథ్యంలోనే వారి ముగ్గురు ఎన్నో రకాల విషయాలను వెల్లడించారు.బాలయ్య బాబుతో కలిసి సరదాగా కాసేపు ముచ్చటించారు.
ఈ నేపథ్యంలోనే సురేష్ బాబు సమంత నాగచైతన్య జంట గురించి స్పందించారు.ఇక ఈ షోలో బాలయ్య బాబు ఒక టాస్క్ లో భాగంగా ఈ తరం మహానటి ఎవరో చెప్పాలి అని అడగగా వెంటనే సురేష్ బాబు, అల్లు అరవింద్ ఒకే అభిప్రాయం ఆ ఛాన్స్ కేవలం ఒక సమంతకు మాత్రమే ఉంది అని వారు తెలిపారు.
ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.ఈ జనరేషన్ లో మహానటి సావిత్రి అంతటి ఫేమ్ సమంత తెచ్చుకునే అవకాశం కలదు.ఆమెకు ఆ అర్హత ఉందని చెప్పుకొచ్చారు.లెజెండ్ సావిత్రితో పోల్చడం అంటే చిన్న ప్రశంస కాదు.
మూడు నాలుగు తరాల హీరోయిన్స్ ని చూసిన సురేష్ బాబు ఆ గౌరవానికి సమంతను ఎంపిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఇకపోతే సమంత నాగచైతన్యలు విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే.
ఆ సమయంలో సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తల వినిపించిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా నాగచైతన్యకు మేనమామ అయిన దగ్గుబాటి సురేష్ బాబు అలాగే దగ్గుబాటి ఫ్యామిలీ ఆ విషయం పట్ల అలా స్పందించారు.
సమంత గురించి వాళ్లు నెగిటివ్ గా అనుకుంటున్నాటూ అంటూ అనేక రకాల వార్తలు వినిపించాయి.అ సమయంలో దగ్గుపాటి ఫ్యామిలీ ఆ వార్తల పై స్పందించకపోవడంతో ఆ వార్తలు నిజమే అని చాలామంది విశ్వసించారు.ఇక తాజాగా సురేష్ బాబు సమంతని పొగుడుతూ మాట్లాడిన తీరును బట్టి చూస్తే నాగచైతన్య సమంత దూరమైనందుకు ఆ కుటుంబానికి ఎటువంటి కోపం లేదు అని తేలిపోయింది.మొత్తానికి ఆ వార్తలకు పులిస్టాప్ పెట్టినట్టు అయింది.
ఆయన మాటలను బట్టి చూస్తే విడాకులు అన్నది వారి వ్యక్తిగత సమస్య కాబట్టి ఎవరిని తప్పు పట్టకూడదు అన్న విధంగా ఆలోచించారు అని అర్థమవుతోంది.