అక్కినేని యువ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వస్తున్న సినిమా లవ్ స్టోరీ.ఆసియన్ సినిమాస్ బ్యానర్ లో సునీల్ నారంగ్, నారాయణ దాస్ ఈ సినిమా నిర్మించారు.
కొన్నాళ్లుగా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్ గా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.ఈ సినిమా రిజల్ట్ మీద నాగ చైతన్య ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది.
సినిమాలో సాయి పల్లవి నటించడం స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు.
లవ్ స్టోరీ సినిమాకు ఆడియెన్స్ లో కూడా సూపర్ బజ్ ఏర్పడింది.
ఇప్పటికే సినిమా టికెట్లు కూడా బాగా సేల్ అవుతున్నట్టు తెలుస్తుంది.శేఖర్ కమ్ముల మార్క్ ప్రేమ కథగా ఈ లవ్ స్టోరీ సినిమా వస్తుంది.
ఇప్పటికే ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచగా నాగ చైతన్య, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల తప్పకుండా వారి మ్యాజిక్ చూపిస్తారని అంటున్నారు.సినిమాకు పవన్ ఇచ్చిన మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని చెప్పొచ్చు.
సినిమా ఈమధ్య జరుగుతున్న బర్నింగ్ ఇష్యూ నేపథ్యంతో తెరకెక్కిందని అంటున్నారు.