ప్రభాస్ తో కలిసి అడ్వాన్స్డ్ ఫ్యూచర్ చూపించబోతున్న నాగ్ అశ్విన్ !

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేయబోతున్న విషయం అందరికి తెలిసిందే.

నాగ్ అశ్విన్ చేసింది రెండే సినిమాలు అయినా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చేసి ప్రేక్షకుల ద్రుష్టి ఆకర్షించాడు.తర్వాత కీర్తి సురేష్ హీరోయిన్ గా మహానటి సినిమా తెరకెక్కించాడు.

ఇక ఈ సినిమాతో నాగ్ అశ్విన్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు.ఇంకా మూడవ సినిమాగా ప్రభాస్ తో సినిమా చేయనున్నట్టు ప్రకటించడంతో ఒక్కసారిగా అందరి చూపు ఈయనపై పడింది.

ప్రభాస్ తో నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేసాడు.సైన్స్ ఫిక్షన్ స్టోరీ ను తెరకెక్కించ బోతున్నాడు.

Advertisement

నాగ్ అశ్విన్ కు సైన్స్ ఫిక్షన్ టెక్నాలజీ జానర్స్ ఇష్టమట.అందుకే ఈ జానర్ నే సినిమా చేయడానికి రెడీ అయ్యాడట.

నాగ్ అశ్విన్ ఇప్పటికే ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసాడని సమాచారం.ఇప్పుడు ఒక క్రేజీ న్యూస్ వినిపిస్తుంది.ఈ సినిమాలో నాగ్ అశ్విన్ అడ్వాన్స్డ్ ఫ్యూచర్ చూపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

టెక్నాలజీని ఉపయోగించుకుని మరి కొన్నేళ్లు మనల్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాడట.మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.

ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా దీపికా పదుకొనె నటిస్తుంది.మరొక కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించబోతున్నాడని సమాచారం.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఈ సినిమాను అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నాడు.మిక్కీ జె మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

ఇది ఇలా ఉండగా ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా, రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా నటిస్తున్నాడు.

తాజా వార్తలు