బీఆర్ఎస్ పార్టీపై నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ “బీఆర్ఎస్” పార్టీ ఏపీలో కూడా విస్తరించడం తెలిసిందే.ఈ క్రమంలో ఆ పార్టీలో తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు ఇంకా మరి కొంతమంది ప్రముఖులు జాయిన్ కావడం జరిగింది.

 Nadendla Manohar Sensational Comments On Brs Party , Nadendla Manohar, Brs, Kcr-TeluguStop.com

బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ నీ కేసీఆర్ నియమించడం జరిగింది.ఇదిలా ఉంటే త్వరలో బీఆర్ఎస్ పార్టీలోకి నాదెండ్ల మనోహర్ జాయిన్ కానున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరుగుతుంది.

పరిస్థితి ఇలా ఉంటే బీఆర్ఎస్ పార్టీపై జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు.జగన్ కి సాయం అందించడానికి జనసేన పార్టీ ఓట్లు చీల్చడానికే ఏపీలో “బీఆర్ఎస్” పెట్టారని చెప్పుకొచ్చారు.

ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో బీఆర్ఎస్… చీలిక తెచ్చిందని నాదెండ్ల వ్యాఖ్యానించారు.బీఆర్ఎస్ వాళ్ల ఏపీకి ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు.

బాధ్యత గల ప్రతిపక్షంగా జనసేన చేస్తున్న కార్యక్రమాలను వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా అడ్డుపడుతుందని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube