ఆ విషయంలో నేను వద్దన్నా మా అమ్మ నాన్న వినరు.. కియారా అద్వానీ!

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ప్రస్తుతం టాలీవుడ్ లో, బాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

భరత్ అనే నేను సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక తన అందంతో మాత్రం యువతను తన వైపు మలుపుకుంది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా తన తల్లి తన గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటుందట.ఫగ్లీ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన కియారా అద్వానీ.

మంచి సక్సెస్ అందుకొని ఆ తర్వాత ఎంఎస్ ధోని సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకుంది.ఇక మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా నటించింది.

Advertisement

ఇదిలా ఉంటే ఇటీవలే తాను నటించిన షేర్షా సినిమా విడుదల కాగా మంచి సక్సెస్ అందుకుంది.

తాజాగా ఓ షోలో పాల్గొన్న కియారా అద్వానీ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది.సోషల్ మీడియాలో తనకు కొన్ని నెగెటివ్ కామెంట్స్ వస్తాయని వాటిని అస్సలు పట్టించుకోనని తెలిపింది.ఇక వాటిని ఉదయాన్నే చూసి రోజును ప్రారంభించడం తనకు నచ్చదని తెలిపింది.

కానీ తన తల్లిదండ్రులు మాత్రం తనకు వచ్చే కామెంట్లపై దృష్టి పెడతారంటూ.ఆ కామెంట్లను చదువుతారని తెలిపింది.

తన తల్లికి తాను ఎన్నిసార్లు చెప్పినా వినదంటూ తన గురించి ఏం రాస్తున్నారో తెలుసుకోవాలని తన తల్లికి ఉంటుందని చెప్పింది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

అందుకే ఈ విషయాలను వాళ్ళకే వదిలేశాను అంటూ.ముఖ్యంగా నెటిజన్లకు ఓ విషయం చెబుతున్నాను అంటూ కొన్ని విషయాలు పంచుకుంది.సాధారణ వ్యక్తులకు ఉన్నట్లే సెలబ్రిటీలకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుందనివారికి కూడా బంధాలు, బావోద్వేగాలు ఉంటాయని తెలిపింది.

Advertisement

ఇక వాటికి విలువ ఇస్తూ వారిని కూడా గౌరవించడం అనేది ధర్మం అని తెలిపింది.

తాజా వార్తలు