Keeravani :నాటు నాటు పాటపై కీరవాణి కామెంట్స్ వైరల్.. అవార్డు వస్తుందని అనుకోలేదు అంటూ?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ( Rajamouli ) తెరకెక్కించిన మూవీ ఆర్ఆర్ఆర్.

ఈ సినిమా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో విడుదల అయ్యి సంచలన విజయం సృష్టించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా కలెక్షన్ల విషయం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కాగా ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్( Natu Natu song ) అవార్డుని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇటీవల ఆస్కార్ అవార్డుల కార్యక్రమం కూడా ముగిసింది.కాగా ఈ పాట యూట్యూబ్లో రికార్డులన్నీ బద్దలు కొడుతూ అత్యధిక కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతోంది.

ఒక తెలుగు భాషలోనే కాకుండా రిలీజ్ అయిన పాన్ ఇండియా భాషలన్నింటిలో కూడా ఈ పాట సంచలనం సృష్టిస్తోంది.త్రూ అవుట్ ఇండియా అన్ని రీజియన్స్‌లో ట్రెండింగ్ లిస్టులోకి ఎక్కేస్తోంది.ఇక ఇందులో చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు స్టెప్పులను ఇరగదీశారు.

Advertisement

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నాటు నాటు పాట గురించి సంగీత దర్శకుడు కీరవాణి ( keravani )మాట్లాడుతూ ఆసక్తికర వాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ.

నాటు నాటు పాట పూర్తి మాస్‌ సాంగ్‌.ఎవ్వరైనా కూడా డ్యాన్స్‌ వేయాలనిపించే సాంగ్‌.

టెక్నికల్‌ గా చెప్పాలంటే శాస్త్రీయ సంగీతం, అద్భుతమైన కవిత్వం, ఇంకా కష్టమైన ఆర్కెస్ట్రేషన్‌కు ఆస్కార్‌ అవార్డులు వస్తాయని మీరు అనుకుంటారు.

అయితే నాటు నాటు అదిరిపోయే కమర్షియల్‌ సాంగ్‌.ఫాస్ట్‌ బీట్‌ నంబర్‌.ఆస్కార్‌ అవార్డు గురించి పక్కన పెడితే.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

అసలు అవార్డు వస్తుందని కలలో కూడా ఊహించలేదు అని తెలిపారు కీరవాణి.కాగా నాటు నాటు పాటపై కీరవాణి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

కాగా గత నెల రోజులలుగా ఆర్ఆర్ఆర్ సినిమా పేరుతో పాటు ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి ల పేర్లు మారుమోగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే.దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వీరి పేర్లు మారుమొగడంతో పాటు భారీగా క్రేజ్ ని ఏర్పరచుకున్నారు.

తాజా వార్తలు