మునుగోడు ఉపఎన్నిక పోలింగ్..నియోజకవర్గంలో పటిష్ట భద్రత

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది.ఈ నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.ఉదయం 9 గంటల నుంచి గంట సమయంలో 11.2 శాతం పోలింగ్ నమోదైంది.ఈ క్రమంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.కాగా మొత్తం 2,41,855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.ఉపఎన్నిక బరిలో 47మంది అభ్యర్థులు ఉన్న విషయం తెలిసిందే.మరోవైపు మునుగోడు జెడ్పీ స్కూల్ లో జరుగుతున్న పోలింగ్ ను బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు.

 Munugodu By-election Polling..tight Security In The Constituency-TeluguStop.com

అటు చండూరు మండలం ఇడికూడలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఓటు వేశారు.అదేవిధంగా నారాయణపురం మండలం లింగవారిగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube