పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ గ్రామంలో అక్రమార్కల మట్టి మాఫియా చెలరేగిపోతుంది.మట్టి దందా కోసం శ్మశానాన్ని కూడా వదలడం లేదు.
మట్టి మాఫియా యధేచ్ఛగా కొనసాగుతున్న సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.అస్తి పంజరాలు, ఎముకలతో సహా మట్టిని తరలిస్తున్నారు భూ బకాసరులు.
అధికారులను సైతం అక్రమార్కులు తమ ఆధీనంలో ఉంచుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మట్టి మాఫియాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.