కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సంబంధించిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.ఈ కామెంట్స్ పై కోమటిరెడ్డి వివరణ ఇచ్చారు.
భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలే కానీ.అందులో వేరే ఉద్దేశ్యం లేదని కోమటిరెడ్డి తెలిపారు.
శత్రువులను కూడా దగ్గరకు తీసుకునే తత్వం తనదని చెప్పారు.తను మాట్లాడిన విషయాలను కట్ చేసి… కొన్ని అంశాలను మాత్రమే లీక్ చేశారని పేర్కొన్నారు.
నన్ను తిట్టొద్దని మాత్రమే చెరుకు సుధాకర్ కొడుకుకు చెప్పానన్నారు.ఈ క్రమంలో మా వాళ్లు చంపేస్తారేమోనని భయంతో చెప్పానని స్పష్టం చేశారు.
అదేవిధంగా తనపై చేసిన వ్యాఖ్యలను ఖర్గే, ఠాక్రేలకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు.అయితే ఇటీవల చెరుకు సుధాకర్ కొడుకుకు ఫోన్ చేసి ఎంపీ కోమటిరెడ్డి బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే.