ఏపీ సీఎం జగన్ తో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి భేటీ అయ్యారని తెలుస్తోంది.తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన అవినాశ్ రెడ్డి జగన్ తో సమావేశం అయ్యారు.
అయితే మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే.దీనిపై ఇటీవలే సీబీఐ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది.
ఈ నేపథ్యంలో అవినాశ్ రెడ్డి సీఎం జగన్ తో సమావేశం కావడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని తెలుస్తోంది.కాగా వీరిద్దరి భేటీకి గల కారణాలు తెలియరాలేదు.







