చిన్న పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటారు.వారికి చిన్న పాటి అసౌకర్యం కలిగినా చాలా బాధ పడతారు తల్లిదండ్రులు.
వారికి ఏ కష్టం రాకుండా పెంచుతారు.ముఖ్యంగా తల్లులు మరింత ఎక్కువగా వారిని కాపాడుకుంటారు.
చిన్న పిల్లలకు చిన్న పాటి గాయం తగిలినా విలవిల్లాడిపోతారు.అయితే, కుటుంబ కలహాల్లో చిన్నారులు చితికిపోవడం మనం చూస్తూనే ఉంటాం.
తల్లి దండ్రులు గొడవ పెట్టుకుంటే ఎక్కువగా బాధ పడేది చిన్నారులే.ఏది ఏమైనా చిన్న పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు.
కానీ ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన మానవత్వానికే మచ్చగా నిలుస్తోంది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని హాపుడ్ లో జరిగింది ఈ అమానవీయ ఘటన.భర్త తనను కొట్టాడన్న కోపంతో ఓ మహిళ ఏడాది వయసు ఉన్న కూతురిపై తన కోపాన్ని ప్రదర్శించింది.భర్తను ఏమీ అనలేక, చిన్న పాపపై తన ఆవేశాన్ని ప్రదర్శించింది.
ఏడాది వయసున్న పాప అని కూడా చూడకుండా తీవ్రంగా కొట్టింది.చిన్నారిని ఎత్తుకొచ్చి నేలకేసి కొట్టింది.
గుక్క పెట్టి ఏడుస్తున్నా కాసింత కూడా కనికరం చూపలేదు.అంతటితో ఆగకుండా తను వేసుకున్న చెప్పును తీసుకుని విపరీతంగా కొట్టింది.
తల్లి హింసకు ఆ బుజ్జాయి ఏడుస్తూనే ఉంది.చిన్న దెబ్బ తగిలితేనే ఎంతో ఏడుస్తారు పిల్లలు.
అలాంటి ఆ తల్లి నేలకేసి కొట్టి, చెప్పుతో చితక బాదుతుంటే ఆ బుజ్జాయి తట్టుకోలేక పోయింది.విపరీతంగా ఏడుస్తూనే ఉంది.
అయినా ఆ తల్లి తన ఆవేశాన్ని, భర్తను ఏమీ చేయలేని తన కోపాన్ని ఏడాది బిడ్డను ప్రదర్శించింది.ఈ దృశ్యాలు పోలీసులకు చేరడంతో ఆ తల్లిపై కేసు నమోదు చేశారు.