బాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీ క్వీన్ గా, ఫైర్ బ్రాండ్ గా నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే కంగనా రౌనత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా కొనసాగడమే కాకుండా సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ తనదైన శైలిలో తన అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.
ఇలా ఈమె ఏదో ఒక కాంట్రవర్సీ ద్వారా వార్తల్లో ఉండటం వల్ల ఈమెను ఏకంగా కాంట్రవర్సీ క్వీన్ అని కూడా పిలుస్తారు.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టికు వెడ్స్ షెరు అనే సినిమాతో బిజీగా ఉన్నప్పటికీ మరొక డేరింగ్ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.
బుల్లితెర నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఏక్తా కపూర్ ఆల్ట్ బాలాజీ, ఎమ్ఎక్స్ ప్లేయర్ కోసం రూపొందించే ఒక ‘ఫియర్లెస్ రియాలిటీ షో‘ కోసం వ్యాఖ్యాతగా కంగనారనౌత్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తరహాలోనే ఈ షో కూడా ఉండబోతుందని, ఈ కార్యక్రమానికి కంగనా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారనే సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే ఈ షో గురించి కంగనారనౌత్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన కొద్దిసేపటికే డిలీట్ చేయడంతో ఈ వార్తలలో వాస్తవం ఉందని తెలుస్తోంది.అయితే త్వరలోనే ఈ విషయం గురించి నిర్వాహకులు అధికారికంగా ప్రకటించనున్నారు.
తాజా వార్తలు