ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా కోట్ల మందిని పట్టి పీడిస్తున్న సమస్య నిద్ర లేమి.తెలిసో, తెలియకో నిద్ర లేమిని నిర్లక్ష్యం చేసామా.
ఇక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.ఒత్తిడి, చికాకు, విసుగు, సీరసం, ఆలసట వంటి సమస్యలు పెరిగిపోతుంటాయి.
అలాగే మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బు, గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి ప్రధాన కారణాల్లో నిద్ర లేమి ముందు ఉంటుంది.అందుకే నిద్ర లేమిని నివారించుకోవడం ఎంతో అవసరం.
అయితే బిర్యానీ ఆకు నిద్ర లేమికి చెక్ పెట్టడంలో అద్భుతంగా సహాయపడుతుంది.బిర్యానీ ఆకునే బే ఆకు అని అంటారు.ఈ బిర్యానీ ఆకులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, ఐరన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్, ఫోలిక్ యాసిడ్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.అందుకే బిర్యానీ ఆకు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.
ముఖ్యంగా నిద్ర లేమి బాధితులు.బిర్యానీ ఆకులను లైట్గా డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ బిర్యానీ ఆకుల పొడి వేసి మరిగించి.నీటిని వడబోసుకోవాలి.
రుచి కోసం తేనెను మిక్స్ చేసుకుని తాగొచ్చు.లేదా డైరెక్ట్గా కూడా సేవించవచ్చు.
ప్రతి రోజు ఇలా చేస్తే.నిద్ర చక్కగా పడుతుంది.
అంతేకాదు, బిర్యానీ ఆకులతో తయారు చేసిన ఈ వాటర్ను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.కంటి చూపు మెరుగు పడుతుంది.అంతే కాదు, మూత్ర పిండాలకు సంబంధించిన వ్యాధులు కూడా తగ్గు ముఖం పడతాయి.కాబట్టి, నిద్ర లేమితో బాధ పడే వారే కాదు.ఎవ్వరైనా బిర్యానీ ఆకులతో తయారు చేసిన వాటర్ను తీసుకోవచ్చు.