అరిబా ఖాన్ అనే 30 ఏళ్ల యువతి అద్భుతం సృష్టించింది.హ్యూమన్ ఎమోషన్స్, మూడ్స్ను టెక్నాలజీ సాయంతో కనిపెట్టే యాప్కు రూపకల్పన చేసింది.
మానసిక ఆరోగ్యానికి ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి ఓ వేదిక తీసుకొచ్చింది.మానసికంగా ఇబ్బంది పడే వ్యక్తులు తమ ఆలోచనలను అనామకంగా చెప్పగలిగే సురక్షితమైన స్థలం లేకపోవడం, ఆమెలో వ్యాపార ఆలోచనను ప్రేరేపించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లోతైన సాంకేతిక మానసిక ఆరోగ్య యాప్ ‘జంపింగ్ మైండ్స్‘కు శ్రీకారం చుట్టింది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఐఐటీ రూర్కీ పూర్వ విద్యార్థి అయిన అరిబా ఖాన్, ఐఐఎం బెంగళూరు పూర్వ విద్యార్థి పీయూష్ గుప్తాతో కలిసి తమ ఆలోచనను ఆచరణ రూపంలో తీసుకొచ్చింది.వ్యక్తులు తమ గుర్తింపును బహిర్గతం చేయకుండా ఇలాంటి పరిస్థితిలో వ్యక్తులతో చాట్ చేసే స్థలాన్ని నిర్మించారు.ఈ యాప్కు జంపింగ్ మైండ్స్ అనే పేరు పెట్టారు.‘అందరికీ సురక్షితమైన స్థలం అవసరం.ఇక్కడ మీరు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మాట్లాడవచ్చు.ఇది వైద్యపరమైన ఒత్తిడిగా ఉండవలసిన అవసరం లేదు.కానీ మనమందరం ఏదో ఒక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాము – చెడ్డ విడిపోవడం, పనిలో కష్టమైన సమయం, కుటుంబంతో సర్దుబాటు చేయడం.కాబట్టి, మీరు ఇలాంటి ఒత్తిళ్లను ఎదుర్కొన్న వ్యక్తులతో కనెక్ట్ అయ్యే డిజిటల్ స్పేస్ని సృష్టించాలని మేము ఆలోచించాము.మీ అనుభవాలను, భావోద్వేగాలను పంచుకోండి.’ అని అరిబా ఖాన్ పేర్కొన్నారు.ఈమె సృష్టించిన యాప్ ఎందరికో ఉపయోగ పడనుంది.వర్క్ వల్ల కలిగే ఒత్తిడి, ఇంటా బయటా ఎన్నో ఆందోళనలు, సమస్యల్లో ఉన్న వారికి ఈ యాప్ సాంత్వన కలిగించనుంది.