పిండితో వినాయకుని ప్రతిమ - అబ్బురపరిచిన మోడల్ స్కూల్ విద్యార్థీని సాన్వీ

రాజన్న సిరిసిల్ల జిల్లా: తొలి ఏకాదశి సందర్భంగా తమ ఇంటి వద్ద గోధుమ పిండి తో హార్షలు తయారు చేస్తుండగా ముస్తాబాద్ మండలం నామాపూర్ మాడల్ స్కూల్ లో 7వ తరగతి చదువుతున్న ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన బండి స్రవంతి -మల్లేశ్ ల పెద్ద కూతురు బండి సాన్వీ మంగళవారం గోధుమ పిండితో వినాయకుని ప్రతిమను చూడముచ్చటగా తయారు చేసి అబ్బురపరిచింది.

వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక విగ్రహాలను వివిధ రకాల రసాయనాలు కలిపిన రంగులతో తయారు చేసి చెరువు కుంటల్లో నిమజ్జనం చేసి పర్యావరణాన్ని పాడుచేయవద్దని మట్టి వినాయకులను పూజించాలని కోరుతూ తన వంతుగా 16 మట్టి విగ్రహాలను తయారు చేయించి ఉచితంగా పంపిణీ చేస్తానని సాన్వీ తెలిపింది.

Latest Rajanna Sircilla News