తెలంగాణలోని కాంగ్రెస్, బీజేపీలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.విద్యార్థుల బలిదానాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆరోపించారు.
అటు బీజేపీకి 119 స్థానాల్లో కనీసం డిపాజిట్ కూడా రాదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో కాంగ్రెస్, బీజేపీకి నిద్రపట్టడం లేదని విమర్శించారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీజేపీ నేతలు చెప్పే మాటలను ప్రజలెవరూ నమ్మరని స్పష్టం చేశారు.బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను కాంగ్రెస్, బీజేపీ ఊహించలేదన్న కవిత ఆ రెండు పార్టీలకు ఓటమి భయం పట్టుకుందని విమర్శలు చేశారు.







