ఎంపీ అరవింద్ తీరుపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీరుపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.అరవింద్ అన్నీ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

 Mlc Kavitha Fire On Mp Arvind-TeluguStop.com

ఆయన మాటలు అత్యంత హేయంగా ఉంటాయన్నారు.యావరేజ్ గా ఎంపీలు 20 డిబేట్లలో పాల్గొంటే అరవింద్ మాత్రం నాలుగేళ్లలో 5 డిబేట్లలో మాత్రమే పాల్గొన్నారని తెలిపారు.

ఎంపీలు 150 ప్రశ్నలు అడిగితే అరవింద్ 65 ప్రశ్నలే అడిగారని చెప్పారు.ఆయన రాజస్థాన్ లోని ఫేక్ యూనివర్సిటీలో చదువుకున్నారని వెల్లడించారు.

దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తానని కవిత పేర్కొన్నారు.అరవింద్ కు ఎంపీగా ఉండే అర్హత లేదని విమర్శించారు.

అరవింద్ ఇంకోసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతానంటూ హెచ్చరించారు.కుక్క కాటుకు చెప్పు దెబ్బ తప్పదన్న ఆమె.ఇంకోసారి తాను పార్టీ మారుతానంటూ మాట్లడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube