తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈనెల 10న జగిత్యాలలో పాదయాత్ర చేయనున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించాయని ఆరోపించారు.
ప్రజలను అప్పుల ఊబిలోకి దించారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే యాత్రని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.