తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది.ఎమ్మెల్యే కోటాలో మూడు స్థానాల భర్తీకి ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.

 Mlc Election Heat In Telangana-TeluguStop.com

మార్చి 29న ముగ్గురు ఎమ్మెల్సీలు రిటైర్ కానున్నారు.నవీన్ రావు, గంగాధర్ గౌడ్ తో పాటు ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీకాలం ముగియనున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే మార్చి 6వ తేదీ నుంచి 13 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.ఉపసంహరణకు వచ్చే నెల 16 చివరి రోజు కాగా… మార్చి 23న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు అధికారులు.

సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ జరగనుంది.

అయితే, ఎమ్మెల్యే కోటాలోని ఈ మూడు సీట్లు అధికార బీఆర్ఎస్ కే దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే అధికార పార్టీలో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది.మహబూబ్ నగర్ -రంగారెడ్డి -హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 21 మంది పోటీ చేయనున్నారు.

ఇందుకు మార్చి 13న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది.అటు హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం అయింది.

మజ్లిస్ అభ్యర్థి మిర్జా రహమత్ బేగ్ గెలుపొందారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube