ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో( Mahbubnagar District ) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్( MLC By-Election Polling ) కొనసాగుతోంది.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,439 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
వీరిలో జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు.ఈ క్రమంలోనే ఇవాళ కొడంగల్ కు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
జిల్లా వ్యాప్తంగా పది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కాగా.పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.కల్వకుర్తి ఎమ్మెల్యేగా కసిరెడ్డి నారాయణ రెడ్డి( Kasireddy Narayana Reddy ) ఎన్నికైన ఆయన ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.కాగా ఈసారి కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ రెడ్డి పోటీ చేస్తున్నారు.







