పేద విద్యార్థుల చదువు కోసం పెన్నులు బుక్ లు అందజేయమనడం ఎమ్మెల్యే ఆలోచన గొప్పది

పెన్నులు బుక్ లు అందజేసిన సర్పంచ్ అక్కనపల్లి జ్యోతి కరుణాకర్( Jyoti Karunakar ).రాజన్న సిరిసిల్ల జిల్లా : చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం ప్రజలు ఎలాంటి పుష్పగుచ్చాలు కానీ శాలువాలు కానీ తీసుకురావద్దని మానవతా దృక్పథంతో చిన్నారుల కోసం పెన్నులు కానీ బుక్స్ కానీ తీసుకువస్తే పేద విద్యార్థుల చదువు కోసం ఉపయోగపడతాయని ఆలోచన ఎంతో గొప్పదని బోయినపల్లి మండలం స్తంభంపల్లి సర్పంచ్ జ్యోతి కరుణాకర్ అన్నారు.

పూల గుచ్చాలకు, శాలువకు బదులు పెన్నులు, బుక్కులు అందజేశామని.

అదేవిధంగా గ్రామంలో ఉన్న పలు సమస్యల ఆయన దృష్టికి తీసుకెళ్లామని.ఎమ్మెల్యే దానికి సానుకూలంగా స్పందించారని సర్పంచ్ అక్కెనపెల్లి జ్యోతి కరుణాకర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ల్యాగల మనోజ్,గడ్డం భార్గవ్, తంగళ్ళపల్లి హరీష్, భీమరి సాగర్, సేపురి సాయి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News