ఉండవల్లిలో అక్రమ మట్టి తవ్వకాల ఆరోపణలపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు.టీడీపీ నేతలు నారా లోకేశ్ ఆదేశానుసారం మాట్లాడుతున్నారు తప్ప నిజమేంటో వారికి తెలుసని చెప్పారు.
తాను గ్రావెల్ అక్రమాలకు పాల్పడ్డానని అభాండం వేసే టీడీపీ నేతల మనసాక్షికి తెలుసు ఎంత వాస్తవమోనని తెలిపారు.కావాలనే కుట్ర పూరితంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.







