రాష్ట్ర మంత్రుల ‘సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర’ గురువారం మొదలుకానుంది.శ్రీకాకుళంలో ఈ యాత్రకు శ్రీకారం చుడుతున్నారు.
రాష్ట్ర మంత్రివర్గంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గానికి చెందిన మంత్రులు బస్సుల్లో రాష్ట్రమంతా తిరుగుతూ సంక్షేమం, పథకాలు, అభివృద్ధి తదితర అంశాలను ప్రచారం చేసేలా బస్సుయాత్రకు రూపకల్పన చేసిన విషయం తెలిసిందే.గురువారం ఉదయం తొలుత మంత్రుల బృందం శ్రీకాకుళంలోని ప్రసిద్ధ దేవాలయం అరసవల్లి ఆదిత్యుడ్ని దర్శించుకుంటారు.
అనంతరం ఏడురోడ్ల జంక్షన్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు.ఆ తర్వాత బస్సులో బయల్దేరి ఇతర జిల్లాలకు యాత్ర కొనసాగిస్తారు.
మంత్రుల యాత్రను దృష్టిలో ఉంచుకుని ఉదయం 8 నుంచి 11 గంటల వరకు శ్రీకాకుళం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.