కోదాడ పట్టణాభివృద్ధిపై మంత్రి, ఎమ్మెల్యే సమీక్ష

సూర్యాపేట జిల్లా: కోదాడ పట్టణాభివృద్ధిపై భారీ నీటి పారుదల,సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే పద్మావతి మంగళవారం మున్సిపల్ చైర్ పర్సన్,అధికారులతో హైదరాబాదులో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కోదాడ పురపాలక సంఘంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టుటకు గాను తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీయుఎఫ్ఐడిసి) ద్వారా రూ.20 కోట్లు,అమృత్ పథకం ద్వారా మంచినీటి సరఫరాకు రూ.25 కోట్లు,

 Minister Uttam Kumar Reddy Mla Padmavati Review On Kodad Urban Development, Mini-TeluguStop.com

శ్రీరంగాపురం,బాలాజీ నగర్ నందు రెండు అర్బన్ పబ్లిక్ హెల్త్ సెంటర్లు నిర్మించుటకు రూ.2 కోట్ల 86 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.ఈనెల 23న మంజూరైన నిధులకు చేపట్టవలసిన పనులకు సంబంధించి శంకుస్థాపనకు తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు.

పట్టణాభివృద్ధికి అవసరమైనన్ని నిధులు మంజూరు చేయిస్తానని మంచి ప్రణాళికతో అభివృద్ధి చేయాలని మంత్రి ఉత్తమ్,ఎమ్మెల్యే పద్మావతి తెలిపారు.ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల, కమిషనర్ రమాదేవి,పబ్లిక్ హెల్త్ డిఈఈ రమాదేవి పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube