సినీ నటుడు బాలకృష్ణపై వైసీపీ మంత్రి రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఏపీలో ఎమర్జెన్సీ పెట్టాలనడం సిగ్గుచేటన్నారు.ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ .1ను బాలకృష్ణ పూర్తిగా చదవాలని తెలిపారు.బావ కళ్లలో ఆనందం చూడాలని బాలయ్య అనుకుంటున్నారన్న మంత్రి రోజా చంద్రబాబు భ్రమ నుంచి బాలకృష్ణ బయటకు రావాలని పేర్కొన్నారు.బాలకృష్ణ ఎవరన్నా స్ర్కిప్ట్ ఇస్తే మాట్లాడారా లేక తెలియక మాట్లాడారా అన్నది అర్థం కావడం లేదన్నారు.
తన అల్లుడు, కూతురు బాగుండాలని తన బావ మెప్పు కోసం ఇలా మట్లాడి ఉండొచ్చని అన్నారు.జీవో నెంబర్ వన్ పూర్తిగా చదివితే బాలయ్య తను మాట్లాడిన ఎమర్జెన్సీ అనే మాట వెనక్కి తీసుకుంటారని మంత్రి రోజా స్పష్టం చేశారు.