తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన రోజా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అప్పట్లో తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది రోజా.
తన అందాలతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హోదాను సొంతం చేసుకుంది.
ఇక వయసు మీద పడుతున్న కొద్ది కొన్ని సహాయక పాత్రలలో నటించింది.కానీ సహాయక పాత్రలలో అంతగా మెప్పించలేకపోయింది రోజా.
తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ షో లో మొన్నటి వరకు జడ్జిగా బాధ్యతలు చేపట్టింది.ఎప్పుడైతే మంత్రి బాధ్యతలు చేపట్టిందో అప్పటినుంచి జబర్దస్త్ కూడా దూరమైంది.
ఇక జబర్దస్త్ లో ఉన్నంతకాలం రోజా తన ఆటపాటలతో బాగా సందడి చేసింది.షో ఎంట్రీ తోనే ఏదో ఒక డాన్స్ స్టెప్ తో బాగా సందడి చేసేది.
ప్రస్తుతం నటనకు, జడ్జి బాధ్యతలకు దూరంగా ఉన్నా కూడా తనకిష్టమైన డాన్స్ లు మాత్రం మంత్రి పదవిలో ఉన్నప్పుడు కూడా వదలట్లేదు.ప్రస్తుతం రోజా ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది.
ఇక మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వార్తల్లో ప్రతి రోజు నిలుస్తుంది.ఏదో ఒక విషయంతో అందరి దృష్టిలో పడుతుంది.
అయితే తాజాగా తిరుపతిలో నిర్వహించిన జగనన్న స్వర్ణోత్సవాల వేడుకలో పాల్గొని బాగా సందడి చేసింది.మామూలుగా రోజా మంత్రి బాధ్యతలు చేపట్టినప్పటికీ కూడా సందర్భం వస్తే మాత్రం డాన్స్ చేయకుండా ఉండదు.ఆ మధ్య ఓ కార్యక్రమంలో కూడా డాన్స్ చేయగా అప్పట్లో ఆ వీడియో బాగా వైరల్ అయింది.
అయితే తాజాగా ఈ కార్యక్రమంలో చేసిన డాన్స్ వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది.
తిరుపతిలో మహతి ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకలో రోజా చీఫ్ గెస్ట్ గా పాల్గొంది.దీంతో ఈ కార్యక్రమంలో కొంత మంది బాలికలు కొన్ని పాటలకు డాన్స్ చేయగా వెంటనే రోజా కూడా వేదిక పైకి వెళ్లి బాలికలతో సహా తను కూడా కొన్ని స్టెప్పులు వేసింది.
ఆమె చీరకట్టులో ఉన్నప్పటికీ కూడా బాలికలతో సమానంగా డాన్స్ చేస్తూ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.ఇక రోజా చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తుంది.దీంతో ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ రోజా డాన్స్ కు ప్రశంసలు కురిపిస్తున్నారు.చాలా అద్భుతంగా డాన్స్ చేశారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక మరికొందరు విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా కొందరు మాత్రం రోజా చేసిన డాన్స్ కు ఫిదా అవుతున్నారు.ప్రస్తుతం జరుగుతున్న జగనన్న స్వర్ణోత్సవ వేడుకలు ఈనెల 24 నుంచి 26 వరకు గుంటూరు జోన్ లో, 29, 30 తేదీల్లో రాజమండ్రి, డిసెంబర్ 7 నుండి 9 వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.