ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైసీపీలో అభ్యర్థుల మార్పుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.గెలవలేని చోట అభ్యర్థులను మార్చుతామని తెలిపారు.
ఇది అన్ని పార్టీలలో సాధారణంగా జరిగేదేనని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.తాము టికెట్లు ఇవ్వని వాళ్లను లాక్కుని టికెట్లు ఇవ్వాలని టీడీపీ చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు.
అయితే వైసీపీలో గెలవలేని వ్యక్తి టీడీపీలో ఎలా గెలుస్తాడో చంద్రబాబు చెప్పాలని తెలిపారు.ఎవరెన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో వైసీపీనే మరోసారి అధికారంలోకి వస్తుందని వెల్లడించారు.