కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ మరోసారి బహిరంగ లేఖ రాశారు.వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలని లేఖలో పేర్కొన్నారు.
స్టీల్ ప్లాంట్ ను కార్పొరేట్ కు కట్టబెట్టే పన్నాగాలు మానాలంటూ తెలిపారు.వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త కుట్ర చేస్తుందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు.
వర్కింగ్ కేపిటల్, ముడి సరుకు కోసం నిధుల సమీకరణ పేరుతో కుట్ర పన్నుతోందన్నారు.కార్పొరేట్ కు రూ.12.5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన మోదీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై ఇదే ఔదార్యం ఎందుకు లేదని లేఖలో ప్రశ్నించారు.ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ విలీనం అంశాన్ని పరిశీలించాలని లేఖలో పేర్కొన్నారు.