రైతుబంధు పథకంపై మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.రైతుబంధుకు నేటితో ఐదేళ్లు పూర్తి అయ్యాయని తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆలోచనతో ప్రారంభించిన రైతుబంధు రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేసి రైతన్నను రాజును చేసిందని తెలిపారు.ఎకరాకు ఏడాదికి రూ.10 వేల చొప్పున ఇప్పటివరకు 10 విడతల్లో రూ.65 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు.రైతు సంక్షేమ పథకంగా దేశానికే రోల్ మోడల్ అయిందని పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ విధానాలు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేస్తున్నాయన్నారు.అబ్ కీ బార్.కిసాన్ సర్కార్ అంటూ బీఆర్ఎస్ ను స్వాగతిస్తున్నారని స్పష్టం చేశారు.