రేవంత్​ రెడ్డి చంద్రబాబు ఏజెంట్​లా పనిచేస్తున్నారు.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు

రేవంత్​ రెడ్డి చంద్రబాబు ఏజెంట్​లా పనిచేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు ఆరోపించారు.రేవంత్‌ ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఆ పార్టీ నాశనమవుతుందని ఆయన విమర్శించారు.

 Minister Errabelli Dayakar Rao Serious Comments On Revanth Reddy Details, Minist-TeluguStop.com

పీసీసీ అధ్యక్షుడిగా పూర్తిగా రేవంత్‌రెడ్డి దిగజారిపోయి మాట్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.రేవంత్‌ ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఆ పార్టీ నాశనమవుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు విమర్శించారు.

కాంగ్రెస్‌లో సీనియర్‌ నేతలు ఒక్కరైనా.రేవంత్‌ మంచోడని చెప్పమనండి.

అంటూ ఆయన ఎద్దేవా చేశారు.

రేవంత్‌ చేసిన లాలూచీ పనులు కేసీఆర్‌ చేయలేదన్నారు.

రేవంత్ చంద్రబాబు ఏజెంట్‌గా పనిచేస్తున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు.ఆయన భాష మార్చుకోవాలంటూ సూచించారు.

తెలంగాణను అభివృద్ధి చేయడంతో పాటు మిషన్‌ భగీరథ ద్వారా గ్రామగ్రామానికి తాగునీళ్లందించిన ఘనత కేసీఆర్‌ దేనని మంత్రి అన్నారు.ఒకప్పుడు రాష్ట్రంలో నీళ్లు, కరెంటు కోసం ధర్నాలు చేసేవారని.

ఈ ఏడేళ్లలో ఎక్కడైనా నీళ్లు, కరెంటు కోసం ధర్నాలు జరిగాయా అంటూ ప్రశ్నించారు.కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇక్కడి పథకాలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు.

కేసీఆర్‌ రైతులకు ఎదురు పెట్టుబడి ఇచ్చి ఆదుకుంటున్నారన్నారు.

రైతుల కోసం సభ పెడుతుంటే కాంగ్రెస్‌ వాళ్లే అసహ్యించుకుంటున్నారని ఆరోపించారు.

బియ్యం కొంటామని కేంద్రం మోసం చేస్తే కేసీఆర్‌ ముందుకొచ్చి కొంటున్నారన్న ఆయన.రైతుల కోసం దాదాపు 3 నుంచి 4 వేల కోట్ల నష్టాన్ని కూడా కేసీఆర్‌ లెక్క చేయడం లేదన్నారు.పీసీసీ అధ్యక్షుడిగా పూర్తిగా రేవంత్‌రెడ్డి దిగజారిపోయి మాట్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube