మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రస్తుతం యునానిమస్ పాజిటివ్ టాక్ తో ప్రదర్శితమవుతున్న సంగతి తెలిసిందే.రెండో రోజు కూడా ఈ సినిమాకు బుకింగ్స్ బాగున్నాయి.
అయితే మోహన్ రాజా డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా నటించిన సినిమా సక్సెస్ సాధించిన నేపథ్యంలో మోహన్ రాజాకు సంబంధించి ఆసక్తికర విషయం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం గమనార్హం.మోహన్ రాజా తండ్రి ఎడిటర్ మోహన్ నిర్మాతగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.
చిరంజీవి ఫ్లాపులతో కెరీర్ పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో ఎడిటర్ మోహన్ మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన హిట్లర్ సినిమాను రీమేక్ చేయాలని సూచించి ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఆ సినిమాతో సక్సెస్ దక్కేలా చేయడం గమనార్హం.
ఇన్ని సంవత్సరాల తర్వాత లూసిఫర్ రీమేక్ ఎంతోమంది డైరెక్టర్లను దాటుకుని ఎడిటర్ మోహన్ కొడుకు అయిన మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కింది.
అప్పుడు తండ్రి హిట్లర్ సినిమా నిర్మాతలలో ఒకరిగా హిట్ ఇస్తే ఇప్పుడు కొడుకు మోహన్ రాజా చిరంజీవి హిట్ సాధించారు.అటు తండ్రి ప్రాజెక్ట్ తో ఇటు కొడుకు ప్రాజెక్ట్ తో సక్సెస్ ను సొంతం చేసుకున్న అతికొద్ది మంది హీరోలలో చిరంజీవి ఒకరు కావడం గమనార్హం.
చిరంజీవి తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా బ్లాక్ బస్టర్ హిట్లు సాధించాలని ఫ్యాన్స్ మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. గాడ్ ఫాదర్ సినిమా తక్కువ సంఖ్యలో థియేటర్లలో విడుదల కావడంతో ఈ సినిమా షేర్ కలెక్షన్లు తగ్గాయి.చిరంజీవి మాత్రం 67 సంవత్సరాల వయస్సులో ఏ మాత్రం జోష్ తగ్గకుండా నటించడం గమనార్హం.గాడ్ ఫాదర్ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి 40 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.