ప్రమాదం తర్వాత ఇంద్రకీలాద్రి దుర్గమ్మని దర్శించుకున్నమెగా హీరో సాయిధరమ్ తేజ్!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గత ఏడాది సెప్టెంబర్ నెలలో స్పోర్ట్స్ బైక్ లో ప్రయాణం చేస్తూ హైదరాబాదులోని కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆయనను దగ్గరలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు.

అక్కడి నుంచి అపోలో ఆసుపత్రికి తరలించి ఆయనకు వైద్యం చేయించిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ ప్రమాదం నుంచి సాయి తేజ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటపడటంతో అభిమానులు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు.

ఇలా ప్రమాదం జరిగిన తర్వాత సాయి ధరమ్ తేజ్ కొన్ని రోజుల పాటు పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు.రిపబ్లిక్ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో సాయి తేజ్ ఇప్పటి వరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఇలా పూర్తిగా తన ఆరోగ్యం నుంచి కోలుకోవటంతో సాయిధరమ్ తేజ్ మొదటిసారిగా తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.

Advertisement

కుటుంబ సభ్యులతో కలిసి సాయితేజ్ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకున్నారు.ఈ క్రమంలోనే ఆలయానికి వచ్చిన వీరి కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.అమ్మవారి దర్శనం తర్వాత వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్న సాయి ధరమ్ తేజ్ కుటుంబ సభ్యులకు అమ్మవారి పట్టువస్త్రాలు ప్రసాదాలను ఆలయ అర్చకులు అందించారు.

ఇక దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన సాయితేజ్ ఎప్పుడు విజయవాడకు వచ్చిన తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకుంటామని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు