వైరల్.. 'యశోద' కోసం భారీ ఖర్చుతో రెస్టారెంట్ సెట్.. ఎంత బడ్జెట్ పెట్టారంటే..

సౌత్ స్టార్ హీరోయిన్లలో సమంత రూత్ ప్రభు ఒకరు.ఈమె గత దశాబ్ద కాలంగా తెలుగు ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

విడాకుల తర్వాత వరుస సినిమాలను అంగీకరిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నవిషయం తెలిసిందే.ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసి పాన్ ఇండియా వ్యాప్తంగా ఒక ఊపు ఊపేసింది.

ఈమె ప్రసెంట్ చేస్తున్న సినిమాల్లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమా ఒకటి.శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఇంకా నిర్మాణం పూర్తి కానీ ఈ సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలు పెరుగుతూ ఉన్నాయి.ఈ సినిమాలో తమిళ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

Advertisement

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం భారీ ఖర్చుతో ఒక సెట్ ను నిర్మించారు మేకర్స్.

హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో హోటల్ సెట్ వేశారు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.హోటల్ సెట్ స్టార్ట్ అయినప్పటి నుండి పూర్తి అయ్యే వరకు ఎలా నిర్మించారో ఈ వీడియోలో తెలుస్తుంది.

అయితే తాజాగా ఈ సెట్ కోసం ఎంత ఖర్చు చేసారో అనే వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ రెస్టారెంట్ సెట్ కోసం యశోద మేకర్స్ దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట.ఎందుకు అంత ఖర్చు చేసారంటే ఈ సినిమా లో దాదాపు 30 శాతం షూటింగ్ ఒకే హోటల్ లో జరుగు తుంది.సుమారు 40 రోజుల షూటింగ్ జరపాల్సి ఉంది.

వైరల్ : కొడుకు కోసం ఆ తండ్రి బిర్యానీతో పడిన కష్టం.. ఎమోషనల్ స్టోరీ..
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 

దీంతో బయట అంత సులభం కాదని సెట్ వేసాము అని మేకర్స్ చెబుతున్నారు.ఈ రెస్టారెంట్ సెట్ సెవెన్ స్టార్ హోటల్ ను తలపించేలా ఉంది.

Advertisement

మరి ఈ సినిమా సమంత కెరీర్ ను ఎలాంటి మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.

తాజా వార్తలు