ఏలూరు జిల్లాలో భారీగా లిక్విడ్ గంజాయి పట్టుబడింది.నూజివీడు మండలం మర్రిబంధంలో లిక్విడ్ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ క్రమంలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కాగా పట్టుబడిన లిక్విడ్ గంజాయి విలువ సుమారు రూ.కోటి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.అనంతరం నిందితుల నుంచి మూడు సెల్ ఫోన్లుతో పాటు బైకును స్వాధీనం చేసుకున్నారు.
పాడేరు నుంచి ముంబైకి గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.