తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో తమిళనాడు మాజీ సీఎం పళని స్వామి, తెలంగాణ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, వెస్ట్ గోదావరి ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు,చిత్తూరు ఎమ్మెల్సీ దొరబాబులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు
.