సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య, మహేష్ తల్లి ఇందిరా దేవి ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఇందిరా దేవి ఆ సమస్యలతో పాటు వయస్సు వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల వల్ల మృతి చెందారని తెలుస్తోంది.
కృష్ణ, ఇందిరా దేవిలకు ఐదుగురు సంతానం కాగా ఈ దంపతుల రెండో కూతురు మంజుల అనే సంగతి తెలిసిందే.తల్లి మరణవార్త తెలిసి మంజుల ఎంతగానో ఎమోషనల్ అయ్యారు.
అమ్మ ప్రేమ నాకు రక్షణ కవచమని అమ్మ లేకుండా ఒక్క రోజు కూడా గడపలేదని మంజుల పేర్కొన్నారు.అమ్మ ఇందిరా దేవి నా మొదటి గురువు అని నా హృదయం నా పునాది అమ్మేనని ఆమె చెప్పుకొచ్చారు.
నా లైఫ్ కు అమ్మే స్పూర్తి అని మంజుల అన్నారు.మా అమ్మకు తెలిసి కేవలం ఇవ్వడం.ఇవ్వడం.ఇవ్వడం మాత్రమే అని మంజుల ఎమోషనల్ అయ్యారు.
తన కొరకు ఏమీ అడగకుండా తన లైఫ్ మొత్తం అమ్మ అలానే చేశారని మంజుల చెప్పుకొచ్చారు.
మంజుల వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
అమ్మ లేకుండా బాల్యంలో ఒక్కరోజు కూడా గడిపింది లేదని అమ్మ అందంగా నవ్వేవారని అమ్మ చమత్కారి అని మంజుల తెలిపారు.ఎవరితో పరిచయం ఉన్నా అమ్మ ఎంతో ప్రేమగా మాట్లాడేవారని మంజుల చెప్పుకొచ్చారు.
అమ్మ చేసిన ప్రతిదానికి మేము కృతజ్ఞులం అని మంజుల కామెంట్లు చేశారు.
అమ్మ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేమని అలాంటి తల్లిని కలిగి ఉన్నందుకు మేము చాలా లక్కీ అని మంజుల చెప్పుకొచ్చారు.అమ్మ త్యాగం, నిస్వార్థమైన ప్రేమ మాటలకు అందనిదని మంజుల చెప్పుకొచ్చారు.అమ్మ మాకు దూరమైనా మా హృదయాలలో ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారని మంజుల కామెంట్లు చేయడం గమనార్హం.