హైదరాబాద్‎కు మాణిక్కం ఠాగూర్.. మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ సమీక్షలు

నల్గొండ జిల్లా మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తోంది.గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది.

ఈ క్రమంలోనే సాయంత్రం హైదరాబాదుకు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ రానున్నారు.రెండు రోజులపాటు ఉప ఎన్నికపై పార్టీ సమీక్షలు నిర్వహించనుంది.

దీనిలో భాగంగా రేపు మునుగోడులో బూత్, క్లస్టర్ ఇంచార్జిలతో ఆయన సమావేశమవుతారు.ఎల్లుండి గాంధీభవన్ లో పిసిసి ముఖ్య నేతలతో ఠాగూర్ భేటీ కానున్నారు.

అనంతరం ఇంచార్జ్ లకు ప్రచార బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం.

Advertisement
పెన్షన్ల విషయంలో చంద్రబాబు రాజకీయం.. : సీఎం జగన్

తాజా వార్తలు