తాజాగా జరిగిన మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగాయి.చివరి వరకు చాలా ఉత్కంఠగా సాగిన ఈ సమరంలో నటుడు ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించి, అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు.
అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో చాలా మంది సినీ ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగానూ మారిన విషయం అందరికీ తెలిసిందే.కాగా ప్రముఖ నటీ రోజా చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
“మళ్ళీ మా అసోసియేషన్ ఎలెక్షన్స్ కి వస్టే సొంత కుటుంబంలోకి వచ్చినట్టు ఉందని” సినీ నటి రోజా అన్నారు.ఎన్ని పొలిటికల్ టెన్షన్లు ఉన్నా కూడా ఒక సినిమా చేసినా, ఒక షో చేసినా అందరం ఒకటిగా ఉంటామని ఆమె చెప్పారు.
అక్కడ ఎలాంటి పాలిటిక్స్ ఉండవన్న రోజా, ఓకే పార్టీ, ఓకే కుటుంబంలా ఉంటామని ఆమె స్పష్టం చేశారు.ఎంతో మంది పెద్ద పెద్ద నటులు ఈ మా అసోసియేషన్ పాలక వర్గంలో ఎప్పుడూ లేని విధంగా జనరల్ ఎలక్షన్స్ ని తలపించే విధంగా వాడిగా, వేడిగా ప్రచారాలు సాగాయని రోజా వ్యాఖ్యానించారు.
మీమ్స్ , ట్రోల్ గానీ కళ్ళారా చూశామని ఆమె తెలిపారు.కానీ తనకైతే అది ఇష్టం లేదని, వాళ్ల మధ్య ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో అందరి ముందు రావడం కూడా చూశామని ఆమె చెప్పారు.
ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఏవరు గెలిచినా గానీ వారు మా అసోసియేషన్ కి అన్ని విధాలా సహకరిస్తారని నటి రోజా ఆకాంక్షించారు.ఈ కోవిడ్ సమయంలో అత్యంత నష్టపోయింది సినీ ఆర్టిస్ట్ లే.కాబట్టి మళ్ళీ పునర్వైభం తీసుకొచ్చేలా గెలిచినా పానెల్ సభ్యులు కృషి చేస్తారని తాను కోరుకుంటున్నట్టు ఈ సందర్భంగా రోజా తెలియజేశారు.