సీఎం ఆశీర్వాద సభను విజయవంతం చేయండి - సర్పంచ్ వెంకట్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని సర్పంచ్ వెంకట్ రెడ్డి నూర్ పాషా దూదేకుల సంఘాన్ని కోరారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం దూదేకుల సంఘం నాయకుడు అజ్జు ఆధ్వర్యంలో సంఘ సభ్యులను సర్పంచ్ వెంకట్ రెడ్డి కలిసి రేపు సిరిసిల్లలో నిర్వహించే ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని మంత్రి కేటీఆర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని సూచించారు.

వారి సూచన మేరకు భారత రాష్ట్ర సమితి కారు గుర్తుకు ఓటు వేస్తామని దూదేకుల సంఘం సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.ఈ కార్యక్రమంలో ధర్వేశ్, ఆఫీస్, షాదుల్, రఫిక్, గౌస్, హబీబ్, సింగిల్ విండో డైరెక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి, వార్డు సభ్యులు కోడి మోజు దేవేందర్, ద్యాగం నారాయణ, బీఆర్ఎస్ నాయకులుగంట వెంకటేష్ గౌడ్, మీసం రాజం తదితరులు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News